టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి భౌతికాయంపై పూలమాలవేసి నివాళులర్పించిన ఎంపీపీ

మల్దకల్ జులై 28 (జనంసాక్షి) మండల పరిధిలోని చిప్పదొడ్డి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి వెంకట్ రాములు అకాల మృతి చెందాడు.గురువారము ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ ఎంపీపీ వై రాజారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, గద్వాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న,మండల సర్పంచుల సంఘంఅధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి,విఠలాపురం సర్పంచ్ పురుషోత్తంరెడ్డి భౌతికాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి ఆంజనేయులు,మధు, ధనంజయ,రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.