టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం మంత్రుల లెటర్‌హెడ్స్‌ ఫోర్జరీ

ఢిల్లీ : ట్రావెల్‌ ఏజెంట్లు కొందరు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి , అనంద్‌శర్మ , కేసీ వేణుగోపాల్‌ల లెటర్‌ హెడ్స్‌ ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న రైలు టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం వాళ్లు వీటిని వాడుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.