టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌
అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు ఆమె భర్త టీడీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరామని, అయితే అక్కడికి వెళ్లాక ఏలూరు నగరాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయామని పేర్కొన్నారు. మరో 40 మంది ఏలూరు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వెల్లడిరచారు. మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ గుణపాఠం నేర్చుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు కాక ముందే ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహావిూని నెరవేరుస్తామని వెల్లడిరచారు.