టియుడబ్ల్యూజే కార్యవర్గాన్నీ సన్మానించిన ఆప్ నాయకులు

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్29,జనంసాక్షి,, నూతనంగా ఏర్పాటైన టియుడబ్ల్యూజే,, ఐజేయు,కార్యవర్గ సభ్యులతో పాటు అధ్యక్షులుగా ఎన్నికైనా కొండూరు రవీందర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్  సయ్యద్  హైదర్  ఘనంగా సన్మానించారు.గురువారం స్థానిక ఆప్ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు, అధ్యక్షునీతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, పూసల పోశెట్టి, కార్యదర్శి, రషీద్ అలం,ఆర్,రాజేశ్వర్లను పూలమాలలు, శాలువ తో ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా అప్ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైమద్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల అందరికి ఇళ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ లు,ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే నెరవేర్చాలని, కోరారు.జర్నలిస్టుల న్యాయ మైన డిమాండ్ల సాధనకు ఎల్లవేళలా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు నిస్తుందని అన్నారు, ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు, అబ్దుల్ తబరేజ్,అబ్దుల్ అజీజ్,ఎస్కె వాజీద్,ఆఫ్రోజ్,జవేద్,కరీం తదితరులు పాల్గొన్నారు