టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు

పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి…

నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు15(జనంసాక్షి)

 

సోమవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జావేద్,అజీరాబేగం మరియు పలువురు ముస్లిం సోదరులు,సోదరీమణులు అందరూ కలిసకట్టుగా కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరినారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,ఈ సందర్బంగా జావేద్ మాట్లాడుతూ,సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మన్ హన్మంతరావు,మున్సిపల్ ఛైర్మన్ కల్పన,వైస్ చైర్మన్ బాబురావు,స్థానిక కౌన్సిలర్ సుమలత కరన్ లాల్,పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.