టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్‌

 

 

హౖదరాబాద్‌:  నవంబర్‌ 15,(జనంసాక్షి):

టీఎన్జీవో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ఆ సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ శుక్రవారంనాడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు  టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. అధినేత స్వామిగౌడ్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీంతో తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతం కానుందని ఆ పార్టీలు నేతలు పేర్కొన్నారు.