*టైం ప్లే‌ పాఠశాల లో‌ విద్యార్థులకు మొక్కలు పంపిణీ*

మేడిపల్లి జనం సాక్షి: రాఖీ పండగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లోని చెంగిచర్ల పరిధిలో క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ నాలుగు లో కిడ్స్ టైం ప్లే‌ పాఠశాల లో‌ ప్రధానోపాధ్యాయులు బి.నరసింహ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదగా పిల్లలకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నాతమ్ములు, అక్క చెల్లెల కు రక్షాబంధన్ కల్పించినట్టే మొక్కలు కూడా మనకి ప్రాణవాయువు అయినా ఆక్సిజన్ ఇచ్చి రక్షిస్తాయనే ఉద్దేశంతో పాఠశాలలో చదివే పిల్లలందరికి మొక్కలు పంపిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు.