ట్రై సైకిళ్లు,చంక కర్రల కోసం దరఖాస్తు చేసుకోండి

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్

నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు11(జనంసాక్షి)

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు చంక కర్రలు,ట్రై సైకిళ్లు అందజేయడం జరుగుతుందని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దివ్యాంగులకు చంక కర్రలు,ట్రై సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని ముఖ్యంగా మహిళా దివ్యాంగులకు ప్రత్యేకంగా చంక కర్రలు ఉన్నాయని అవసరమైన దివ్యాంగులు ఉపయోగించుకోగలరని కోరారు.ఆసక్తి కలిగిన దివ్యాంగులు ఆన్లైన్ లో ఓబి ఎంఎంఎస్ అనే సైట్ లో దరఖాస్తు చేసుకొని ప్రింట్ కాపీ,సదరం సర్టిఫికెట్,ఆధార్ కార్డ్,ఒక ఫోటో,కులం,ఆదాయం సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు జతచేసి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు నాగర్ కర్నూల్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.వీరందరికీ స్వాతంత్ర దినోత్సవం రోజు పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని అన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరారు