‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

narendra-modiదిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను ప్రారంభించారు. డిజిటల్‌ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జెట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలాసీతారామన్‌, భాజపా అగ్రనేత అద్వానీ తదితరులు హాజరయ్యారు.