డెహ్రాడూన్‌ చేరుకున్న వైమానిక దళాల ప్రధానాధికారి

డెహ్రాడూన్‌ : బాధితులను తరలించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద మృతులు, సైనికులు మృతికి సంతాపం తెలిపారు. బదరీనాథ్‌, హర్డిల్‌ ప్రాంతాల్లో సహాయకచర్యలు వివరించారు. హెలికాప్టర్‌ ప్రమాద మృతులను వెలికితీసే కార్యక్రమం కొనసాగుతున్నట్లు చెప్పారు.