డైట్ సెట్కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు
హైదారాబాద్: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్ సెట్ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్ సెట్ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనరు ఆర్. సురేంద్రరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3 లక్షల 18 వేల మంది విద్యార్థులు హజరవుతున్నారు. ఈ ఏడాది నుంచి అభ్యర్థులు కచ్చితంగా ఓఎంఆర్ షీట్ మీద బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలన్న నిబంధన విధించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ కోసం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 23 డైట్ కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలో 3 వేల సీట్లున్నాయి. ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో మరో 30 వేల డీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.