ఢల్లీికి బయలుదేరిన సీఎం రేవంత్‌

హైదరాబద్‌(జనంసాక్షి):రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం సీఎం రేవంత్‌ ఢల్లీి వెళ్లారు. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి వరద నష్టంపై మరోసారి వినతిపత్రం అందిచనున్నారు. అనంతరం అధిష్టాన పెద్దలను కలవనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై,నామినేట్‌ పదవులపై  చర్చించే అవకాశముంది.