ఢాకా బాధితులను పరామర్శించిన హసినా

ఢాకా, జనంసాక్షి: గతవారం ఢాకాలో ఎనిమిదంస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా సందర్శించారు. సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ నెల 24న రాణా ప్లాజా వాణిజ్య సముదాయ భవనం కూలిపోవడంతో దాదాపు 400 మంది మృతి చెందారు.