ఢిల్లీలో పర్యటిస్తున్న నగర ప్రజాప్రతినిధుల బృందం

ఢిల్లీ: ఢిల్లీలో హైదరాబాద్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటిస్తుంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో నేతలు, స్వచ్ఛ హైదరాబాద్ బృందం పర్యటిస్తున్నారు. జహంగీర్‌పురిలోని డంపింగ్ యార్డును నేతలు పరిశీలిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణపై నేతలు, అధికారులు అధ్యయనం చేయనున్నారు. చెత్త సేకరణ, చెత్త నుంచి విద్యుదుత్పత్తిపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అనంతరం ఈ బృందం కేంద్ర మంత్రి మనోహర్ పారికర్‌తో సమావేశం కానున్నారు.