ఢిల్లీ కాంట్రాక్టు ఉద్యోగులకు కేజ్రీవాల్ శివరాత్రి కానుక!

kejriwal
 ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంట్రాక్టు ఉద్యోగులకు మహాశివరాత్రి కానుక ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ప్రకటనతో సరిపెట్టని ఆయన కొద్దిసేపటి క్రితం తన ప్రభుత్వం చేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించారు.
ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడిగా ఎన్నికల బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిదే. ఆ తర్వాత ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్యుల అంచనాలకనుగుణంగానే పనిచేసుకుపోతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, మహాశివరాత్రి పర్వదినాన కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను ప్రసాదించారు.