ఢిల్లీ హరినగర్‌లో దారుణం

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉద్యోగమిస్తానని నమ్మించి…. వివాహితపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఢిల్లీ హరినగర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి… నిందితుడు ఓ పార్టీలో పరిచయమయ్యాడు. తనకు ఉద్యోగమిస్తానంటూ నమ్మించాడు. ఓ హోటల్‌కు రమ్మని ఫోన్ చేయటంతో.. ఆమె అక్కడకు వెళ్లింది. రూమ్‌కు వెళ్లాక ఆమెపై… కిరాతకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పొద్దంటూ బెదిరించాడు. బాధితురాలు, తన భర్తతో కలిసి హరినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది. తన న్యాయం జరిగేలా చూడాలని…కంటతడిపెట్టుకుంది.