తండ్రి జ్ఞాపకార్థం సభావేధిక కు పూర్వ విద్యార్థి షేక్ అస్లామ్ షరీఫ్ విరాళం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన సేవా సమితి సభ్యుడు షేక్ అస్లాం షరీఫ్ తన తండ్రి షేక్ ఖాదర్ షరీఫ్ 27 వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాన్ దొడ్డి లో పూర్వ విద్యార్థిని, విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సభవేధిక కు తన తండ్రి జ్ఞాపకార్థం 12,000 రూపాయలు విరాళంగా గుత్తేదారు కు మంగళవారం అందించారు.ఈ సందర్భంగా అస్లాం మాట్లాడుతు మా నాన్న నసనూర్ లో ఉపాధ్యాయులు గా పనిచేసే సమయం లో నేను ఈ పాఠశాలలో ఏడవ తరగతి వరకు ఈ పాఠశాలలో చదివాను అని,సభవేధిక పనులు 20 శాతం మిగిలి ఉన్నాయని,మిగతా పూర్వ విద్యార్థిని ,విద్యార్థులు తమ విరాళం ఇస్తే, సభవేధిక పనులు అయిపోతాయని,అందరు సహకరించాలని అన్నారు.మంచి నాణ్యత ప్రమాణాలతో సభవేదికను కట్టిస్తున్న గుత్తేదారు షాలం ను శాలువా,చిన్న బహుమతి తో సత్కరించారు. అలాగే పాఠశాలలో 30 సంవత్సరాలుగా స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రాముడును శాలువా, పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఖలీల్, సుధాకర్,అరుణాకర్, షేక్షావలి శివుడు తదితరులు పాల్గొన్నారు.