*తండ్రి మందలిస్తాడని భయంతో కుమారుడు ఆత్మహత్య

రాజోలి జులై 28(జనం సాక్షి)
తండ్రి కోపగించుకుంటాడనే అనుమానం తో కుమారుడు ఆత్మహత్య.వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల కేంద్రం లోని కుర్వ రామకృష్ణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. బుధవారం ఆయన తన కూతురు ఇంటికి వెళ్లగా ఆయన భార్య తో పాటు కుమారుడు సురేష్ (19) పొలం పనులకు వెళ్ళాడు.ఎద్దుల బండిపై తన తల్లి తో పాటు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా,ఎద్దు కాలు బెనికి కింద పడడంతో ఎద్దుకు గాయాలయ్యాయి. దీంతో నాన్న కోపగించుకుంటాడని తలచి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తీసుకవేళ్ళగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.తన కుమారుడు అలా మృతి చెందడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు, బంధువులు రోధించారు. ఈ ఘటనతో రాజోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై తండ్రి పిర్యాదు మేరకు ఎస్ ఐ లేనిన్ కేస్ నమోదు చేశారు.