తమ్ముడూ తప్పు చేస్తున్నావ్…
– యోగి తీరును తప్పుపట్టిన ఉమాభారతి
దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): హాథ్రస్ ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు భాజపాకు కూడా మచ్చ తెచ్చిందని ఆమె అన్నారు. బాధిత యువతి కుటుంబాన్ని కలుసుకునేందుకు రాజకీయ నాయకులు, విూడియాను అనుమతించాలంటూ యోగి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. హాథ్రస్ ఘటనపై ఉమాభారతి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఓ దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత పోలీసులు హడావుడిగా ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని, గ్రామాన్నీ ఎవరితో కలవనీయకుండా చేస్తున్నారు. హాథ్రస్ ఘటనలో బాధ్యులపై విూరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించి ముందు ఈ విషయాల గురించి నేను ఏవిూ మాట్లాడొద్దని అనుకున్నా. కానీ బాధితుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. సిట్ దర్యాప్తు జరుగుతున్నందున బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? ఇలాంటి ఘటనల వల్ల సిట్ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయి. రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మనం(భాజపా ప్రభుత్వం) దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హావిూ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాథ్రస్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు.. అటు యూపీ ప్రభుత్వంతో పాటు భాజపాకు కూడా మచ్చ తెస్తోంది’అని వరుస ట్వీట్లలో ఉమాభారతి మండిపడ్డారు. ప్రస్తుతం తాను కరోనావైరస్కు చికిత్స తీసుకుంటున్నానని, లేదంటే ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్ని అని ఆమె అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారిని పరామర్శిస్తానని తెలిపారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయనాయకులు, విూడియా వ్యక్తులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరారు. ‘భాజపాలో నేను విూకంటే సీనియర్ని. విూకు అక్కలాంటి దాన్ని. నా అభ్యర్థలను, సూచనలను కొట్టిపారేయొద్దు’అని సీఎం యోగిని కోరారు