తల్లిదండ్రులు మందలించారని విషగుళికలు మింగిన విద్యార్ధులు: ఇద్దరు మృతి

7xn94wt4
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన బెంగుళూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజారెడ్డి, నాగేశ్వర్‌లు మరణించారు. మరో విద్యార్ధి చంద్రమోహన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.