తహసిల్దార్ కార్యాలయం ముందు సామూహిక గీతాలాపన

మల్దకల్ ఆగస్టు 16 (జనంసాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు 11:30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ హరికృష్ణ,నాయబ్ తహసిల్దార్ మదన్ మోహన్ గౌడ్, ఆర్ ఐ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, సిబ్బంది మధు, సుబ్రహ్మణ్యం గౌడు,సాయి,తో పాటు వీఆర్ఏలు సంఘ అధ్యక్షుడు లక్ష్మన్న, వీఆర్ఏలు సామూహిక గీతలాపనలో పాల్గొన్నారు.