తిమ్మప్ప స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

మల్దకల్ సెప్టెంబర్ 29(జనం సాక్షి)హరిహరాదుల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీదేవి అమ్మవారిని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణదేవి గా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అర్చకులు, వాల్మీకి పూజారులు ఆధ్వర్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సదుపాయాలు కల్పించారు.