తీవ్రవాద కార్యకలాపాలకు.. 

తమిళనాడు అడ్డాగా మారింది
తమిళనాడుపై కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు..
చెన్నై, జూన్‌23(జ‌నం సాక్షి) : తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డాగా మారిందంటూ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తున చొరబడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎప్పటి నుంచో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నానన్నారు. తమిళనాడు నుంచి బీజేపీకి ఏకైక ఎంపీగా కొనసాగుతున్న రాధాకృష్ణన్‌ విూడియాతో మాట్లాడుతూ… తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డాగా మారిందని, జల్లికట్టు ఆందోళన సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించిందన్నారు. ఏడాదిన్నర నుంచి ఇదే విషయమై నేను ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కొండ ప్రాంతాల్లో నక్సలైట్‌ శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం తీవ్రవాదులు కొన్ని విూడియా సంస్థల్లోకి కూడా చొరబడ్డారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనీ… అలా చేయకుంటే వారికి ప్రభుత్వంలో కొనసాగే హక్కులేదని రాధా కృష్ణన్‌ పేర్కొన్నారు.