తుక్కు దుకాణంలో పేలుడు
– నలుగురి మృతి
ముజఫర్ నగర్, జూన్25(జనం సాక్షి ) : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లో సోమవారం ఉదయం ఓ తుక్కు దుకాణం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భద్రతా చర్యలు ప్రారంభించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆఘటనలో మృతి చెందిన వారిలో తుక్కు దుకాణ యజయాని ఉన్నారు. మరో ఇద్దరు సరకు కొనుగోలు చేయడానికి వచ్చి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో మృతదేహాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీనిపై ముజఫర్నగర్కు చెందిన పోలీస్ అధికారి మాట్లాడుతూ…’ భద్రతా సిబ్బంది, యాంటీ టెర్రర్ పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రమాద కారణాలు విశ్లేషించే పనిలో ఉన్నారు. శక్తిమంతమైన బాంబును ఈ పేలుళ్లకు ఉపయోగించినట్లు తెలుస్తోందని తెలిపారు.