తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం బాలవరం కేపీఆర్‌ సంస్థ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేపీఆర్‌ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులను బాలవరం, జి.దొంతమూరు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.