తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి

సాగు విధానాన్ని పరిశీలించి న ఏఈఓ రాఖేష్
రామారెడ్డి    ఆగస్టు 8     జనంసాక్షీ  :
రైతులు వేసిన వానకాలం సీజన్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో రాఖేష్ రైతులకు  సూచించారు.రామారెడ్డి మండలం   గిద్ద గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం పంట సాగు వివరాలను నమోదు చేశారు. అంతకుముందు తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట మార్పిడి చేయడంతో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. రైతులు లాభదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. పంట సాగు వివరాలను నమోదు చేసుకుంటే దిగుబడులను సులువుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏమైనా సాగు సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను   సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు