తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

 

ఆత్మకూర్(ఎం) జులై 29 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం తుక్కపురం గ్రామానికి చెందిన పోనగాని శ్రీశైలం తెరాస పార్టీలో ఆదినుండి చురుకుగా ఉండే నాయకులు ఆయన ఇటీవలేగుండె పోటుతో అకస్మాత్తుగా మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపుర అరుణ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు