తెలంగాణలో చైనా పరిశ్రమ

4
– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్‌ తయరీ సంస్ద కెడియక్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఓక యంవోయుని కుదుర్చుకున్నది. ఐఆచీ సంస్ధ చైనా దేశంలో స్టాక్‌ మార్కెట్‌ లో లిస్ట్‌ అయిన ఓక ప్రఖ్యాత ఏలక్రానిక్స్‌ తయారీ సంస్ధ. ఈ రోజు బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంతో ఐఆచీ సంస్ధ ఈ యంవోని  కుదర్చుకున్నది.  ప్రపంచంలో కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను  తయారుచేసే ఏకైక సంస్ధ ఐఆచీ అనీ, ఈ సంస్ధ ఇప్పటికే ఇలాంటి సదుపాయం కలిగిన మెబైల్‌ ఫోన్‌ ని తయారు చేసిందని సంస్ధ ప్రతినిదులు మంత్రికి తెలియజేశారు. దీంతో పాటు మెబైల్‌ పోన్లు, ట్యాబెట్ల తయారీ రంగంలోనూ ఐఆచీ ప్రముఖ సంస్ధగా ఉన్నదని, తమ సంస్ధ ఫిలిప్స్‌, డాల్బీ 3డి  వంటి ప్రముఖ ఏంటర్‌ టెన్‌ మెంట్‌ సంస్ధలతోనూ కలిసి పని చేస్తుందని ప్రతినిదులు మంత్రికి తెలియజేశారు. వినోద పరిశ్రమ అవసరాల కోసం వాడే  ఫిల్మ్‌ తయారీలో ప్రపంచ నంబర్‌ వన్‌ సంస్ధ 3ఓ కంపెనీ తర్వతీ స్దానంలో తాము ఉన్నట్లు మంత్రికి తెలిపారు.  గత ఏడాదిలో తమ సంస్ధ 1.2 బిలియన్‌ డాలర్ల రెవెన్యూని సాధించిందని, గ్రూప్‌  విస్తరణలో  భాగంగా తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మంత్రితో సమావేశానంతనరం సంస్ధ ప్రతినిధులు నగరంలో అందుబాటులో ఉన్న మౌళిక సదుపాయాలను పరిశీలించారు. ఐఆచీ తోపాటు యంవోఓలో భాగస్వామి ఐనా గ్రూప్‌ కి 15 దేశాల్లో 45 కంపెనీలున్నాయని తెలిపింది. జాయింట్‌ గ్రూప్‌ భాగసామ్యమ

సంస్ధ తెలంగాణలో అందుబాటులో ఉన్న నిఫునులు, ఐటి పరిశ్రమ ముఖ్యంగా కనెక్టీవీటి సౌకర్యాల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడులకి ఏంచుకున్నట్లు తెలిపింది.

తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటి పార్కులు, ఐటి సెజ్‌ లు సైతం తమ భవిష్యత్తు పెట్టుబడులకి ఉతం ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.  తెలంగాణలో అద్దాలులేని 3డి

తెరలు, మెబైల్‌ పోన్లు, టివి వంటి ఏలక్ట్రానిక్‌ గృ¬పకరణాలను తయారు చేయనున్నట్లు సంస్ధ యంవోలో పెర్కోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ బాగసామ్యం ద్వారా పూర్తి

సహయ సహకారాలందించేందుకు సిద్దమని తెలిపింది.ఏలక్ట్రానిక్స్‌, గేమింగ్‌ కంటెట్‌, మెబైల్‌ మానిపాక్చరింగ్‌ రంగాల్లోని ప్రముఖ సంస్ధతో యంవోఓ కుదుర్చుకోవడం పట్ల మంత్రి కె.తారక రామరావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన, పారిశ్రామిక విధానం వలన అనేక అంతర్జాతీయ స్ధాయి కంపెనీలు నగరానికి వస్తున్నాయని, ఇదే వరుసలో ఐఆచీ తెలంగాణ పట్ల ఆసక్తి చూపిస్తున్నదని మంత్రి తెలిపారు. ఐఆచీ పెట్టుబడులకి హైదరాబాద్‌ సరైన గమ్యస్ధానామన్న మంత్రి, కంపెనీ సేవలకి కావాల్సిన మెబైల్‌ మ్యానిఫాక్చరింగ్‌ సదుపాయాలు, గేమింగ్‌ మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రత్యేక మెబైల్‌ మ్యానిపాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ మెబైట్‌ మ్యానిపాక్చరింగ్‌ పాలసీ ప్రవేశపెట్టున్నట్లు తెలిపారు.ఇక వినోద పరిశ్రమ కోసం గేమింగ్‌ సిటీ నిర్మాణం తర్వలో ప్రారంభం కాబోతున్నదని, దేశంలోనే రెండో అతి పెద్ద సినిమా పరిశ్రమ తెలుగే నని మంత్రి ఐఆచీ ప్రతినిదులకి తెలిపారు. ప్రంపచంలోనే మెదటిసారి త్రిడి తెరతో మెబైల్‌ తయారు చేస్తున్నామన్న ఐఆచీ సంస్ధ ప్రతినిధులు మంత్రికి తమ మెబైల్‌ పోన్‌ ( ఇంకా మార్కెట్‌ లోకి విడుదల చేయకముందే) బహుకరించారు.  అందులో ఉన్న త్రీడీ వీడియోలను ఏలాంటి కళ్లద్దాలు లేకుండానే చూవచ్చని మంత్రి తెలిపారు. ఐఆచీ సంస్ధ రూపొందిచిన మెబైల్‌ ని వీక్షించిన మంత్రి వారికి ప్రోడక్ఠ విజయవంతం అవుతుందని, ఇలాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్ధకి పూర్తి సహయ సహకారాలుంటాని మంత్రి హవిూ ఇచ్చారు. ఈ సమావేశంలో ుూఎఎఅ ఓఆ వెంటక్‌ నర్సింహ రెడ్డి, ఐటి శాఖ ఏలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ లు పాల్గోన్నారు.