తెలంగాణ రాకుంటే మన బతుకులు ఆగమైతయి

– చంద్రబాబు, బొత్స, విజయమ్మ అఖిలపక్షానికి హాజరుకావాలి

– టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

 

కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుంటే మన బతుకులు ఆగమైతాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ కళాభారతిలో నిర్వహించిన న్యూ డెమోక్రసీ ఉద్యమ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎప్పటికీ న్యాయం జరుగదని అన్నారు. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, బొత్స సత్సనారాయణ, వైఎస్‌ విజయమ్మ హాజరుకావాలని కోరారు. వారిని పదే పదే వైఖరి అడగాల్సిన అవసరం లేదని, సమావేశానికి వచ్చి పది నిమిషాల్లో తమ పార్టీ స్టాండ్‌ ఏమిటో చెబితే సరిపోతుందన్నారు. పార్టీ వైఖరి చెప్పకుంటే ఆయా పార్టీలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.23న తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని, 26న మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించారు.