తెలంగాణ సాధనకై తన చివరి శ్వాస వరకు పోరాడిన మహావ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్

బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 6 : తెలంగాణ సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలపై చివరి శ్వాస వరకు ఉద్యమం పోరాటం చేసిన మహావ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కమాండర్ బి రామ్ ప్రకాష్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధార్థ కర్తగా పిలువబడే ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎటువంటి పదవులు ఆశించకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమించారని ఆయన కొనియాడారు. తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పోరాడారు. ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని స్మరించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, ఆర్ఐలు రాజేష్, రమేష్ బాబు, శ్రీధర్, తదితర బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.