తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది తెలుగువారు గల్లంతయ్యారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీలు ఉత్తరాఖండ్‌ రావద్దని అక్కడి ప్రభుత్వం కోరినందువల్లే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లలేదని తెలిపారు.