తెలుగు సీరియల్కు తీసిపోని రియల్ స్టోరీ
ఆహరంలో విషం కలిపి అత్తింటి వారిని బలితీసుకున్న కోడలు
ముంబై,జూన్23(జనం సాక్షి): తెలుగు సీరియల్స్కు దగ్గరగా ఓ కోడలు అత్తింటి వారిని మట్టుబెట్టింది. అచ్చు సీరియల్ కథలా ఉన్నా రియల్గా జరిగిందో వ్యవహారం.తనను అవమానించిన అత్తింటి వారిని ఏకంగా యమపురికి పంపింది. నల్లగా ఉన్నావు…వంట చేయడం రాదని విమర్శించినందుకు ఆహారంలో విషం కలిపి 5గురి మృతికి కారణమైంది. మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్ జ్యోతి సురేష్ సర్వసేకు రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని, వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి విూద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది.ఈ నెల 18న మహడ్ గ్రామానికి చెందిన సుభాష్ మణెళి అనే ఓ బంధువు తన గ్రామంలో ఒక వేడుక నిర్వహించాడు. జ్యోతి తన అత్తింటి వారితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యింది. అత్తగారి కుటుంబం విూద పగ తీర్చుకోవడానికి ఈ వేడుకే మంచి అవకాశంగా భావించింది. అతిథుల కోసం సిద్ధం చేసిన భోజనంలో విషం కలిపింది. ఈ విషాహారం తినడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 7 – 13 ఏళ్ల వయసు పిల్లలు నలుగురితో పాటు ఓ 53 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. విషయం తెలిసుకున్న ఖాలాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆహార పదర్దాలను పరీక్షించడం కోసం ఫోరెన్సీక్ లాబ్కు పంపించినట్లు తెలిపారు.