తొలిరోజే దాదాపు 20 కోట్లు సంపాదించిన ‘యే జవానీ హై

దివానీ’

ఢిల్లీ : దీపికా పదుకొణె , రణ్‌బీర్‌కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘యే జవానీ హైదివానీ’ తొలిరోజే 19.45 కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టింది. భారత్‌లోనే కాక విదేశాల్లోనూ సినిమాకు మంచి ఓ పెనింగ్స్‌ లభించినట్లు సమాచారం. దీపిక, రణ్‌బీర్‌ నిజజీవితంలో ప్రేమికుల్లా విడిపోయాక తొలిసారి తెరపై కలిసి నటించిన చిత్రం కావడంలో అభిమానులు అసక్తిగా ఎదురు చూశారని, అందుకే కలెక్షన్లు బాగా వస్తున్నాయని వ్యాపారవర్గాలు అంటున్నాయి.