దక్షిణాఫ్రికాలో ఎన్నారై హత్య

డర్బన్‌, (జనంసాక్షి): దక్షిణాఫ్రికా ప్రవాసభారతీయుడొకరు కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. బెంజమిన్‌ మూడ్లే(46) ను ఆయన కొడుకు డరేన్‌ పదయాచి కిరాతకంగా హత్య చేశాడు. ఛాతీ భాగంలో కత్తితో పొడిచి చంపాడు. ఉత్తర డర్బన్‌ లోని ఫోనిక్స్‌ ఇండియన్‌ టౌన్‌ షిప్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంటుంది. కుటుంబ కలహం కారణంగానే అతడీ దారుణానికి పాల్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. బెంజమిన్‌ 20 ఏళ్ల పాటు జైళ్లో ఉండి గతేడాదే విడుదలయ్యాడు.