దళిత ఎమ్మెల్యే పై గిరిజనుల దాడి సరి కాదు.

ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షుడు కాలూరి మల్లేష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి):

విద్యుత్ షాక్ తో గిరిజన వ్యక్తి మృతి చెందాడని దాంతో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వద్దకు వెళ్తే కించపరిచి మాట్లాడారని గుంపన్ పల్లి గిరిజనులు ఆరోపించడం సమంజసం కాదని నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు కాలూరి మల్లేష్ మండిపడ్డారు.శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇదంతా ప్రతిపక్ష పార్టీ నేతల కుట్రలేనని ఆయన అన్నారు.ఎమ్మెల్యే ను ఎదుర్కొన డం చేతకాక గిరిజనులను అడ్డం పెట్టుకొని ఆయన పై లేనిపోని నిందలతో కూడిన ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ఇప్పటివరకు అందరిని అదుకున్నారని అది మరిచి నీచ రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కుట్రలు మాని మృతుని కుటుంబానికి న్యాయం చేసే దిశగా ప్రతిపక్ష నేతలు ఆలోచించాలని ఆయన అన్నారు.అదికూడా ఎమ్మెల్యే గువ్వల వల్లనే సాధ్యమని ఆయన అన్నారు.కార్యక్రమంలో బొల్లే పర్వతాలు పాల్గొన్నారు.