దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

 ఎమ్మెల్యే
మక్తల్ ( జనం సాక్షి )  :
  దళితుల ఆర్థిక స్వావలంబన  కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామానికి చెందిన 10 మంది లబ్దిదారులకు 06 ట్రాక్టర్లు, 04 హార్వెస్టర్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని ప్రతి లబ్ది దారుడు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఇట్టి  అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్, ఎంపీపీ వనజ దత్తు, మక్తల్ మాగనూరు మండలాల అధ్యక్షులు గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area