దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ హత్యను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన

అయిజ,ఆగస్టు 17(జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ అంబేద్కర్ విగ్రహాం దగ్గర ఎమ్మార్పీఎస్,మరియు ప్రజా సంఘాల నాయకుల అధ్వర్యంలో నిరసన తెలిపారు.75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల వేడుకల్లో రాజస్థాన్ లో  జరిగిన దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ హత్యను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజేష్, మండల అధ్యక్షుడు నాగరాజు,సీనియర్ నాయకులు ఆంజనేయులు,ఇమానేయులు, విజయ్ భాస్కర్ రెడ్డి,అశ్వ మార్రెప్ప,డాక్టర్ రాజు,తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area