దాండియాలో ఉత్సాహంగా చిందేసిన ఎమ్మెల్యే పైలెట్- సాంప్రదాయాలు వేరైనా మనమంతా ఒకటే.

దాండియాలో ఉత్సాహంగా చిందేసిన ఎమ్మెల్యే పైలెట్- సాంప్రదాయాలు వేరైనా మనమంతా ఒకటే

తాండూరు అక్టోబర్ 17 (జనం సాక్షి) దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూర్ పట్టణం చల్ల గార్డెన్ లో సోమవారం రాత్రి గుజరాతీలు మార్వాడీలు దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం గుజరాతిలు మార్వాడీలతో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాండియాలో ఉత్సాహంగా చిందులేస్తూ ఆడుతూ అలరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాల సంస్కృతి,సంప్రదాయాలు వేరువేరుగా ఉన్న దేశ ప్రజలంతా ఒక్కటేనని గుర్తు చేశారు.
సాంప్రదాయాలు వేరు అయినా మనమంతా ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మరియు మార్వాడీలు గుజరాతిలు తదితరులు ఉన్నారు.