దాసుపల్లి మల్లయ్య కుటుంబానికి అండగా ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి

బ్రెయిన్ సంభందిత మెరుగైన వైద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం
గత నెల రోజుల క్రితం 2 లక్షల 50 వేల అర్థిక సహాయం అందజేత
తెలకపల్లి మండలంలోని దాసుపల్లీ గ్రామానికీ చెందిన మల్లయ్య గారు కొన్ని రోజులుగా బ్రెయిన్ సంభందిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అర్థిక పరిస్థితులతో మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేకపోయారు, ఎమ్మెల్యే శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మల్లయ్య గారికి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలు LOC లెటర్ మంజూరు చేయించి ఈరోజు  రాజు గారికి అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెలలో కూడా ముందుగా మల్లయ్య గారికి 2 లక్షల 50 వేల LOC లెటర్ అందజేయడం జరిగింది అని అన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు