దుండగుల దాడిలో 11 మంది మృతి

నైజీరియా : తూర్పు నైజీరియాలోని అడమవా రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. తుపాకులు, కత్తులతో దుండగులు గవర్నర్‌ ఉంటున్న మిల్దు గ్రామంలో దాడులకు దిగారు. అయితే ఈ సమయంలో డిప్యూటీ గవర్నర్‌ గ్రామంలో లేరు. దుండగుల దాడిలో ఇద్దరు గవర్నర్‌ భద్రతా సిబ్బంది సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.