దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నామినేషన్లు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నామినేషన్ల పర్వానికి నేటి నుంచి ఎన్నికల కమిషన్ తెరతీసింది. పశ్చిమ బెంగాల్లోని బనగావ్ లోక్ సభతో సహా ఆరు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 చివరి తేదీ. కాగా తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.