దేశవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలను నిలిపివేస్తున్నాం:నెస్లీ ఇండియా..

ఢిల్లీ:మ్యాగీ అమ్మకాలను దేశ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న మ్యాగీ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వివాదం సద్దుమణిగాక తగిన ప్రమాణాలతో మార్కెట్లోకి మళ్లీ విడుదల చేస్తామని సంస్థ పేర్కొంది. మరొవైపు ప్రధాని కార్యాలయం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి సమన్లు పంపింది. మ్యాగీ నూడిల్స్ వివాదంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.