దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్లో దొంగ నోట్ల ముఠాగుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలిస్తుండగా… ఇద్దరు పరారైయ్యారు. దాంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.