దొడ్డగణపతి ఆలయంలో రాహుల్ పూజలు
బెంగళూరు,మే9(జనం సాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం బసవన్గుడి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ దొడ్డ గణపతి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. దొడ్డ గణపతికి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని కన్నడ ప్రజల నమ్మకం. అందుకే రాహుల్ వీలు చూసుకుని గణపతి ఆలయానికి ఆలయానికి వచ్చారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఆలయంలో పూజలు తర్వాత బసవన్గుడి ప్రాంతంలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంలో పట్టణమంతా తిరుగుతూ ఓటర్లకు అభివాదం చేశారు. రాహుల్ వెంట పలువురు కర్నాటక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రోడ్ షో తర్వాత రాహుల్ అక్కడి కృష్ణానగర్ పారిశ్రామిక వాడలోని క్రియేటివ్ గార్మెంట్ ఫ్యాక్టరీని
సందర్శించారు. చాలాసేపు కార్మికులతో గడిపారు. వారి కష్టసుఖలు అడిగి తెలుసుకున్నారు.