దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్‌. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంత్యక్రియలు స్వస్థలంలో నిర్వహించాలని బెహరా కుటుంబసభ్యులు కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీ నుంచి డాక్టరేట్‌ పొందిన బెహరాను గతేడాది మేలో మెల్‌బోర్న్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌గా నియమించారు. మంచి రచయిత కూడా అయిన బెహరా మాస్కో, వాష్గింగ్టన్‌,లండన్‌లోనూ దౌత్యవేత్తగా పనిచేశారు.