ధరణి సమస్యలపై

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్ గారు పిలుపునిచ్చారు
దీక్ష ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల వరకు  కొనసాగనుంది.
వికారాబాద్(జనంసాక్షి)నవంబర్15 బుధవారం నాడు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం. ప్రసాద్ కుమార్ గారు ముఖ్య అతిధిగా వికారాబాద్ RDO కార్యాలయం ముందు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు అక్రమంగా వేలం వేస్తూ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అదేవిదంగా ధరణి పోర్టల్ ద్వారా నీరు పేద రైతులను మోసం చేస్తూ అధికారులు, ప్రభుత్వం కుమ్మకై
రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నందున ధరణి సమస్యలు వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తూ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది*
కాబట్టి ఈ కార్యక్రమనికి వికారాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాలు, యువ జన కాంగ్రెస్, బూత్ ఎన్రోలర్స్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు మరియు ధరణి పోర్టల్ లో భూమి సమస్యలు ఉన్నటువంటి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా
కోరుతున్నాము