నరేంద్రస్వామి అనబోయి..నరేంద్రమోడీ అన్న సిద్దరామయ్య
బెంగళూరు,మే8(జనం సాక్షి): కర్ణాటక ఎన్నికల్లో నేతలు నోరు జారుతున్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ సీఎం అభ్యర్థి యడ్యూరప్పది అవినీతి ప్రభుత్వం అని నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు సీఎం సిద్దరామయ్య అలాగే నోరు జారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థి నరేంద్ర స్వామి తరఫున ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి నరేంద్ర స్వామి వల్లే సాధ్యమైంది అనబోయి.. నరేంద్ర మోదీ వల్లే అని నోరు జారారు. తర్వాత నవ్వుతూ దానిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇక్కడ నరేంద్ర అన్నది ముఖ్యం అని సిద్దరామయ్య అన్నారు. స్వామి ఇక్కడున్నారు.. మోదీ గుజరాత్లో ఉంటారు. నరేంద్ర మోదీ కల్పితమైతే.. ఈ నరేంద్ర స్వామి నిజమని ఆయన చెప్పారు. ఆయన కన్నడలో మాట్లాడిన ఈ మాటలను టైమ్స్ నౌ ట్వీట్ చేసింది.