నాగాలాండ్‌లో బాంబు పేలుడు…ఒకరి మృతి

కోహిమా : నాగాలాండ్‌ రాష్ట్రంలో దిమాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. ప్రదీప్‌ థపా అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై రైల్వేస్టేషన్‌కు సమీపంలోని రోడ్డుపై వెళ్తుండగా బాంబు పేలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.