నాటేత కూలీల దేశభక్తి.

ఫోటో రైటప్: పొలంలో నారు పెట్టడానికి వచ్చిన కూలీల సామూహిక జెండా వందనం.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని పంట పొలంలో మంగళవారం ఉదయం కూలీలు జాతీయ భావం ఉట్టిపడేలా నారు పెట్టడానికి వచ్చిన కూలీలు 11-30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నారు పెట్టడానికి వచ్చిన కూలీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా తాము సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొనాలని ఉందని పొలం యజమాని సుంకరి నారాయణకు తెలియజేయడంతో పొలం పనులకు ఆటంకం కలుగకుండా పొలంలోనే జాతీయ జెండా ఏర్పాటు చేసి సామూహిక జాతీయ గీతాలపన చేయడానికి ఏర్పాట్లు చేశాడు. దీంతో పంట పొలాల్లో ఉన్న కూలీలు, రైతులు జాతీయ గీతాలపనలో పాల్గొన్నారు. పంట పొలంలో జాతీయ జెండా ఏర్పాటు చేసిన రైతు నారాయణను అందరూ అభినందించారు.