నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో పోలిస్తే కేజ్రీవాల్ సంపద ఈసారి రూ.2లక్షలకు తగ్గింది. ఆయన తన ఆదాయ వివరాలను నామినేషన్ పత్రాల్లో దాఖలు చేశారు. తనపై 10 కేసులున్నాయని కేజ్రీవాల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా మంగళవారం నామినేషన్ వేసేందుకు బయల్దేరిన కేజ్రీవాల్  రోడ్ షోకు అభిమానులు పోటెత్తడంతో సమయానికి నామినేషన్ వేయలేకపోయిన విషయం తెలిసిందే.

మరోవైపు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా నామినేషన్ వేశారు. అలాగే అజయ్ మాకెన్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనున్నాయి.